27.7 C
Hyderabad
April 26, 2024 04: 06 AM
Slider మహబూబ్ నగర్

రంజాన్ ప్రార్ధనలకు ముస్లింలు బయటకు రావద్దు

Kollapur CI 251

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని కొల్లాపూర్ సిఐ బి.వెంకట్ రెడ్డి కోరారు. కొల్లాపూర్ లోని సిఐ కార్యాలయం లో నేడు మసీదు కమిటీ సభ్యులు, ఇమామ్, మొజం లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎస్ ఐ మురళి గౌడ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలతో మాట్లాడూ అనుమతించిన నలుగురు మాత్రమే మసీదుల్లోకి వెళ్లి ప్రార్ధనలు జరుపుకోవాలి వేరే వారు ఎవరూ మసీదులకు వెళ్ల వద్దని ఆయన అన్నారు.

ఇఫ్తార్ విందులు జరుపు కోవడం కూడా నిషేధమనే విషయం గమనించి ప్రజలు సహకరించాలని సిఐ వెంకట్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను అందరూ పాటించాలని అప్పుడే కరోనాను సమాజం నుంచి తరిమి కొట్టగలుగుతామని ఆయన అన్నారు. ముస్లిం సోదరులకు సిఐ బి.వెంకట్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

మహాత్మా గాంధీజికి  నివాళులు

Satyam NEWS

బ్రుటల్:అక్రమ సంబంధం వద్దన్నభార్యను బాదుతూ

Satyam NEWS

ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలి.. పువ్వాడ

Bhavani

Leave a Comment