వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ముఖ్యపదవులకు కొల్లాపూర్ విద్యార్థి నాయకులు ఎన్నికయ్యారు. కాకతీయ యూనివర్సిటీలో ఎబివిపి 38వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో రాష్ట్ర కార్యసమితి సభ్యుడు(స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ )గా మూలే భరత్ చంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా మెంటే శివకృష్ణ ఎన్నిక అయ్యారు.
వీరిద్దరూ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. ఉద్యమాల పురిటి గడ్డ అయిన వరంగల్ లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలోని ఒక విద్యార్ధి సంఘానికి నాయకులుగా తమ బిడ్డలు కావడంతో కొల్లాపూర్ ప్రాంత వాసులు సంతోష పడుతున్నారు.