ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎంపీటీసీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని కొండాపూర్ గ్రామ ఎంపీటీసీ ఇస్లావత్ జగన్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటి నుంచి సమస్యల్లో ఉన్న ఆ కుటుంబాన్ని నేడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. మృతుని భార్య ఇస్లావత్ నము ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధైర్యం చెప్పారు.