30.7 C
Hyderabad
April 24, 2024 01: 30 AM
Slider తెలంగాణ

కొండాపూర్ ఎంపీటీసీ కుటుంబానికి కోమటిరెడ్డి పరామర్శ

komatireddy 10

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎంపీటీసీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని కొండాపూర్ గ్రామ ఎంపీటీసీ ఇస్లావత్ జగన్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పటి నుంచి సమస్యల్లో ఉన్న ఆ కుటుంబాన్ని నేడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. మృతుని భార్య ఇస్లావత్ నము ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ధైర్యం చెప్పారు.

Related posts

కరోనా వైరస్ భయంతో గ్రామాల మధ్య కంచె

Satyam NEWS

4వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

Satyam NEWS

RTI ఫోరం ములుగు జిల్లా ఉపాధ్యక్షునిగా బోడ రాజు

Satyam NEWS

Leave a Comment