సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉండే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందచేశారు. ఇందుకోసం మొత్తం రెండు కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో నేడు పర్యటించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మమ్మ రాజగోపాల్ రెడ్డి పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంచిపెట్టారు.