రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు తక్కువ ధరకు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నార్కెట్ పల్లి పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా యువ రైతు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ని ఆయన ప్రారంభించారు.
ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో స్థాపించిన ఈ కంపెనీ ద్వారా రైతులకు నాణ్యమైన, తక్కువ ధరలో విత్తనాలు ఎరువులు, ఇతర వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచడం ముఖ్య ఉద్దేశమని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.