కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భువనగిరి పార్లమెంటు సభ్యుడు భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఆమెకు వివరించినట్లుగా తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా చాలా రాష్ట్రాలకు పిసిసి అధ్యక్షులను మార్చడం, కొత్త వారిని నియమించడం చేస్తున్న సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సోనియా గాంధీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చాలా కాలంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి వరించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా అధిష్ఠానం ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి.