28.2 C
Hyderabad
April 20, 2024 13: 18 PM
Slider హైదరాబాద్

మంచోళ్లను ముందు పెట్టి పెద్దోళ్లు దోచుకుతింటున్నారు

#konda Vishweswarareddy

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ దత్తత డివిజన్ లో అలీ తలాబ్ చెరువు ఆదివారం కాంగ్రెస్ ,బిజెపి పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు.

టీఆర్ఎస్ పార్టీలో మంచోళ్లను ముందర పెట్టి దొంగలు దోచుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్ సర్కార్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఎప్పుడు కమీషన్ల పేరుతో ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నాడు అని ఆరోపించారు.

కేటీఆర్ జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి  నియోజకవర్గం లోని హైదర్ నగర్ డివిజన్ చెరువుని మంత్రి కేటీఆర్ దత్తు తీసుకొని అభివృద్ధి మాత్రం మరిచారా అని  సోషల్ మీడియా వేదికగా విమర్శించడంతో కొండ విశ్వేశ్వర్  రెడ్డి పైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ట్విట్టర్ లో తనపై బూతులు తిడుతూ దాడి చేస్తున్నారు, దమ్ముంటే క్షేత్రస్థాయిలో చర్చకు రావాలని సవాల్ విసిరితే ఏ ఒక్క నాయకుడు రాలేదని ప్రజలకు ఉపయోగపడే ప్రతి సమస్యను తీర్చేందుకు తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజా పోరాటంలో ముందుకు వెళ్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

Sub Editor

మళ్లీ దేవుడిని అవమానించిన లీనా మణిమేకలై

Satyam NEWS

ఆంధ్రా బస్సులు ఎక్కద్దు… తెలంగాణ బస్సులు ఎక్కండి

Satyam NEWS

Leave a Comment