36.2 C
Hyderabad
April 16, 2024 20: 37 PM
Slider రంగారెడ్డి

కాంగ్రెస్‌లోకి మళ్లీ వచ్చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

#revanthreddy

మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిశారు.

కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రేవంత్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ చర్చలు ఫలించాయి. కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు విశ్వేశ్వర్ రెడ్డి గ్రీన్ సిగ్నలిచ్చారు.

భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంచి కోసం పరితపిస్తుంటారని, ఆయనతో రాజకీయాల కంటే.. రాష్ట్రాభివృద్ధిపైనే చర్చించామని రేవంత్‌ తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎప్పుడైనా రావొచ్చని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ రావడం సంతోషంగా ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌ను వీడిన తర్వాత విశ్వేశ్వరరెడ్డితో పలువురు నేతలు మంతనాలు జరిపారు. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరలేదు.

Related posts

సందీప్ రెడ్డి  మరణం తీరని లోటు

Satyam NEWS

చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుతుగున్న కామ పిశాచి

Satyam NEWS

ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి సాయం

Satyam NEWS

Leave a Comment