మహా శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ లోని త్రికోటేశ్వర స్వామి కి రూ.53,72,560 ఆదాయం లభించింది. ఉత్సవ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణ లో శనివారం హుండీ లెక్కింపు చేపట్టారు. ప్రత్యేక, శీఘ్ర దర్శనం, అభిషేక టికెట్ లు, ప్రసాదాలు ద్వారా ఆదాయం సమకూరింది.
అన్నదానం హుండీ ద్వారా రూ.8058 నగదు లభించింది. 65 గ్రాముల బంగారం, 1725 వెండీ ని భక్తులు హుండీ లో వేశారు. గత ఏడాది కంటే 15.5 లక్షలు ఆదాయం అధికం గా వచ్చినట్లు ఈ వో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు.