గత రెండున్నర సంవత్సరాలుగా వెంకట్ రెడ్డి నగర్ నుండి కోఠి 115V నిలిచిపోయిన బస్సు సర్వీసులను కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ పున ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ జనతాపార్టీ ఎల్లవేళల కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు 115 V కోఠి ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటుందని ప్రజలు వినియోగించుకోగరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రాగి వెంకట్ రెడ్డి, పూజారి సోమయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, దారం వెంకటేష్ గుప్త, ముశిగంపల శివ గౌడ్, మహిళా మోర్చ అధ్యక్షురాలు రాగి లతా వెంకట్ రెడ్డి,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి