27.7 C
Hyderabad
April 20, 2024 00: 40 AM
Slider కరీంనగర్

ఓమ్స్ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా కోటోజు జ్యోతి రాణి

#KotojuJyothiRani

వితంతు, ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా హుజురాబాద్ పట్టణానికి చెందిన కోటోజు జ్యోతి రాణిని నియమించినట్లు వితంతు, ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం డైరెక్టర్ సంద బాబు నియామక  పత్రాన్ని  ఈ  రోజు అందించారు.

మహిళా సమస్యల పరిష్కారం కోసం సామాజిక ఉద్యమకారిణి గా, కవయిత్రిగా తన రచనలతో ప్రజలను మేల్కొల్పుతూ, సేవా కార్యకర్తగా, సామాజిక చైతన్యం కోసం తన ప్రతిభ కనబరుస్తూ, పలు రకాల సేవలు అందిస్తున్నందుకు కు ఆమెను గుర్తించి కరీంనగర్ జిల్లా వితంతు ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా నియమించినట్లు నియామక పత్రం లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జ్యోతి రాణి మాట్లాడుతూ వితంతు ఒంటరి  మహిళా సంక్షేమ సంఘం బలోపేతం కోసం మండల కమిటీలను వేసి, వారి సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల సాధన కోసం పాటుపడతానని అన్నారు.నా ఎంపికకు సహకరించిన ములుగు జిల్లా ఓమ్స్  కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి రాంచందర్ కి డాక్టరేట్

Bhavani

స్లేవరీ:9 నెలలుగా జీతం లేక ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Satyam NEWS

డిపిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్.పురుషోత్తం

Satyam NEWS

Leave a Comment