గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,080 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా, 402 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 97,35,850 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 3,78,909 మందికి చికిత్స కొనసాగుతున్నది వివరించారు. కరోన నుండి ఇప్పటి వరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1,41,360 మంది మృతి చెందారు. నిన్నఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 36,635గా నమోదైంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.66% కాగా మరణాల రేటు 1.45%గా నమోదైంది.
previous post