విజయవాడ దుర్గాఘాట్లో కృష్ణమ్మకు నదీ హారతులు పునఃప్రారంభం అయ్యాయి. రుత్వికులు నేటి సాయంత్రం కృష్ణానదికి హారతులు సమర్పించారు.
ఈ కార్యక్రమానికి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్బాబు తదితరులు కూడా హాజరయ్యారు.
ఇకపై ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు కృష్ణమ్మకు హారతుల కార్యక్రమం కొనసాగనున్నది. అయితే పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు.