నేడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు, మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు మృతి చెందాడు. ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ప్రాంతం అంతా విషాదంలో నిండిపోయింది. హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుండి కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
previous post