34.2 C
Hyderabad
May 19, 2025 18: 01 PM
Slider ఆధ్యాత్మికం

గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌

#Tirumala

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ  తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదికపై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో భాగంగా బుధ‌వారం ఉద‌యం శ్రీకృష్ణ జన్మాష్టమి పారాయ‌ణం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా భ‌క్తుల గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో తిరుమ‌ల గిరులు ద్వార‌క‌ను త‌ల‌పించాయి. తిరుమ‌ల‌లో టిటిడి నిర్వహిస్తున్న పారాయణ‌ కార్య‌క్ర‌మం బుధ‌వారం 125వ రోజుకు చేరుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వ్యాస‌మ‌హర్షి ర‌చించిన భాగ‌వ‌తంలోని ద‌శ‌మ‌స్కంధం మూడ‌వ ఆధ్యాయంలోని శ్రీ‌కృష్ణుని జ‌ననం పారాయ‌ణం చేశారు. 

ఆనంత‌రం తిరుప‌తి ఇస్కాన్ నుండి వ‌చ్చిన 20 మంది భ‌క్తులు నామ‌సంకీర్త‌న నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, డెప్యూటీ ఈవోలు హ‌రీంద్ర‌నాధ్‌, బాలాజి, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి విభీష‌ణ శ‌ర్మ తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని పాల్గొన్నారు. 

తిరుమలలో శ్రీకృష్ణ‌స్వామివారికి విశేష అభిషేకం

తిరుమలలో శుక్ర‌వారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వ‌ర్యంలో  నిర్వహించారు. గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి  ఉదయం 10.00 గంట‌ల నుండి పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, కుంకుమ‌, చంద‌నం, పంచామృతాభిషేకాలు చేశారు.

ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

ట్రాజెడీ: పిల్లలను అనాధలుగా చేసిన ఈదురుగాలులు

Satyam NEWS

కర్ణాటకను కుదిపేస్తున్న ‘‘హనీట్రాప్’’ రాజకీయం

Satyam NEWS

సో శాడ్: నడ్డాను కలిసి వెనుదిరిగిన జనసేన అధినేత

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!