నిన్న నల్లగొండలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం నాయకులపై జరిగిన లాఠీఛార్జ్ నిరసిస్తూ బీజేవైఎం కూకట్ పల్లి శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రైవేట్ టీచర్ల నియామకాన్ని వెంటనే చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. ఇందులో భాగంగా నల్లగొండ బీజేవైఎం తెలుపుతుంటే నల్గొండలోని పోలీసులు అత్యుత్సాహం చూపించింది.
అక్కడ యువమోర్చా నాయకులపై అక్రమంగా అమానుషంగా లాఠీఛార్జ్ చేశారు. ఇందులో చాలామంది నాయకులు కార్యకర్తలు గాయపడ్డారు. దీనిని ఖండిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలోని వై జంక్షన్ దగ్గర కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రీతం రెడ్డి, బిజెపి నాయకులు సాయినాథ్ రెడ్డి పవన్ కుమార్ ఆర్ సాయి ముసపెట్ ప్రకాష్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.