హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ఎంఎల్ సి స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని గెలిపించాలని కూకట్ పల్లి కాంగ్రెస్ నాయకులు కోరారు.
ఈ మేరకు వారు కూకట్ పల్లి నియోజకవర్గం లోని బాలానగర్ డివిజన్ H A L కాలనీ లో వారు ప్రచారం చేశారు. హైదరాబాద్- రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Dr సత్యం శ్రీరంగం , సుధీర్ రెడ్డి, మధు గౌడ్ , పప్పు , రవి స్టీవెన్సన్ , శేఖర్ ,ప్రసన్న ,హుస్సేన్ తదితరులు ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.