లాక్ డౌన్ కారణంగా జీవనం కష్టంగా మారిన వారిని ఆదుకోవడానికి కూకట్ పల్లి ఆర్టీసీ డిపో TMU కార్మికులు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఒక్కో ప్రాంతంలో కొందరికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న TMU నాయకులు నేడు పర్వత్ నగర్, బోరబండ అల్లాపూర్ లో ఉంటున్న ఒడిసా వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంచిపెట్టారు. కూకట్ పల్లి నియోజకవర్గం బిజెపి ఇన్ చార్జి మాధవరం కాంతారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూకట్ పల్లి ఆర్టీసీ డిపో TMU కార్మికులు ఈ కార్యక్రమానికి సహకరించారు.
previous post