33.7 C
Hyderabad
February 13, 2025 20: 13 PM
Slider ఆధ్యాత్మికం

అత్యంత వేడుకగా కుంభమేళా ఆరంభం

#kumbhmela

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ఆరంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజామునుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేక తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటుచేశారు. అటు చిన్నచిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తున్నారు.

Related posts

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభం

Satyam NEWS

ఉప శాఖల పంచాయితీ: ప్రజా ధనం వృధా

mamatha

సమయపాలన పాటించని ప్రభుత్వ టీచర్లు: పట్టించుకోని విద్యాధికారులు

mamatha

Leave a Comment