కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా కుంభోత్సవ వేడుకలు ప్రారంభం అయ్యాయి.
కుంభోత్సవంలో భాగంగా ఉదయం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారికి సాత్విక బలి గా కొబ్బరి కాయలు నిమ్మకాయలు గుమ్మడి కాయలు సమర్పించారు.
ఆలయ ప్రాంగణం నిమ్మకాయలతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఈ కుంభోత్సవ వేడుకలు మరింత వేడుకగా జరుగనున్నాయి.