27.7 C
Hyderabad
April 26, 2024 05: 13 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ భీమలింగేశ్వర స్వామి కోవెలలో శోభాయమానంగా లక్ష కుంకుమార్చన

#kunkumarchana

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామివారి కోవెలలో శుక్రవారం అత్యంత శోభాయమానంగా మహిళా భక్తులచే లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగింది.

ముందుగా ఆలయ అర్చకులు రెంటాల సతీష్ శర్మ నిర్వహణలో శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి పంచసూక్త విధానంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కుంకుమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మేళతాళాలతో మహిళా భక్తులచే కుంకుమను ఊరేగింపు గా శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకొని శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష కుంకుమ పూజ చేసుకున్నారు. పూజానంతరం అమ్మవారికి ధూప,దీప,నైవేద్య,నీరాజన,మంత్రపుష్పం సమర్పించి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గుజ్జుల కొండారెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పాల్గొని స్వామి,అమ్మవారి కృపకు పాతృలైనారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పల్నాడుకు నీరు ఇచ్చేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు

Satyam NEWS

బాబు విడుదలతో మిన్నంటిన సంబరాలు

Satyam NEWS

వనపర్తిలో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా పట్టివేత

Satyam NEWS

Leave a Comment