32.2 C
Hyderabad
April 20, 2024 18: 58 PM
Slider నెల్లూరు

హాఫీజ్ ఖాన్ ను వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించాలి

nellore 20

విద్యావంతుడు మైనార్టీ సమస్యలపై చక్కని అవగాహన కలిగిన కర్నూల్ శాసన సభ్యులు హాఫిజ్ ఖాన్ ను రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్ భాషా ఒక ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కోరారు.  ముస్లింలకు చెందిన అతి ముఖ్యమైన సంస్థ వక్ఫ్ బోర్డు అని వేల కోట్ల విలువ గల ఆస్తులు ఉన్న వక్ఫ్ బోర్డు కు గత కొంత కాలం నుండి పాలక వర్గం లేకపోవడం వలన ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ముస్లింలకు చెందిన మసీదుల, దర్గాల, పీర్ల చావిడిల అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలి అంటే పాలక వర్గం అవసరం ఉందని ఆయన అన్నారు. గత కొంత కాలం నుండి వక్ఫ్ భూములు అనేక ప్రాంతాలలో ఆక్రమణకు గురి అవుతున్నాయని వాటిని అరికట్టాలి అంటే సమర్థుడైన వ్యక్తి వక్ఫ్ బోర్డు చైర్మన్ గా రావలసిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ముస్లిం మత సంస్థలతో, సంఘాలతో చక్కటి సంబంధాలు కలిగి వెంటనే స్పందించే గుణం ఉన్న కర్నూల్ శాసన సభ్యులు హాఫిజ్ ఖాన్ ని వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమిస్తే ముస్లింలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. ముస్లింలు ఎదురుచూస్తున్న వక్ఫ్ బోర్డు పాలక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని, ఉప ముఖ్యమంత్రి యస్.బి.అంజాద్ భాషాని కోరారు. ఈ కార్యక్రమంలో.MHPS రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీ ఉల్లా. షేక్  రఫీ.షేక్ ఉస్మాన్.షేక్ యస్దని. పాల్గొన్నారు.

Related posts

ఒంటిమిట్ట చెరువులో మహిళ మృతదేహం

Satyam NEWS

రుజువులు ఎక్కడ తేను

Satyam NEWS

పవన్ ని విమర్శించే అర్హత ఎమ్మెల్యే మేడా కు లేదు

Satyam NEWS

Leave a Comment