27.7 C
Hyderabad
April 25, 2024 07: 50 AM
Slider కర్నూలు

యవగళం పాదయాత్రపై కర్నూలు టీడీపీ నేతల సమీక్ష

#kurnool

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  యువగళం పాదయాత్ర త్వరలో అనంతపురం జిల్లాలో పూర్తి చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నందున ఉమ్మడి కర్నూలు జిల్లా  తెలుగుదేశం పార్టీ నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిసెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కర్నూలు నగరంలోని సోమవారం మౌర్యా ఇన్ నందుతో ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జోన్ 5 ఇంచార్జి ఎన్.అమర్నాథ్ రెడ్డి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ముఖ్యులుగా హాజరయ్యారు. యువగళం పాదయాత్ర ఏర్పాట్ల విషయమై చర్చించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ 2019 అభ్యర్ధి మాండ్ర శివానంద రెడ్డి, ఎం.ఎల్.సి లు ఎన్.ఎం.డి.ఫరూక్, కె.ఇ.ప్రభాకర్, బి.టి.నాయుడు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జీలు బుడ్డా రాజశేఖర రెడ్డి (శ్రీశైలం), టి.జి.భరత్ (కర్నూలు), గౌరు చరితా రెడ్డి (పాణ్యం), భూమా బ్రహ్మానంద రెడ్డి (నంద్యాల), బి.సి.జనార్ధన్ రెడ్డి (బనగానపల్లె), మన్నె ధర్మారం సుబ్బా రెడ్డి (డోన్), కె.ఇ.శ్యాం బాబు (పత్తికొండ), ఆకెపోగు ప్రభాకర్ (కోడుమూరు), డాక్టర్ బి.వి.జయనాగేశ్వర రెడ్డి (ఎమ్మిగనూరు), పి.తిక్కా రెడ్డి (మంత్రాలయం), కోట్ల సుజాతమ్మ (ఆలూరు), కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి కొంకా భూపాల్ చౌదరి, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్, పి.జి.నరసిమ్హులు యాదవ్, బత్తిన వెంకట రాముడు, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, వైకుంటం మల్లికార్జున చౌదరి అ.వి.ఆర్.కె ప్రసాద్,రామచంద్రరావు దేవెళ్ళ మురళి, యస్.సవితమ్మ, జిల్లెల శ్రీ రాములు,ఎన్.టి.రామాంజనమ్మ, వెంకటశివుదు యాద్వ, మాజి జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మొదలగు వారితో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related posts

కైండ్ గెశ్చర్: విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ వితరణ

Satyam NEWS

జ్వరం నుంచి కోలుకున్నా ఒళ్లు నొప్పులున్నాయి

Satyam NEWS

ఆగస్టు 15 కల్లా బేస్ బెంట్ స్థాయి వరకూ పూర్తి కావాలి

Satyam NEWS

Leave a Comment