ములుగు మండలం గూర్తుర్ తండా పరిధిలోని నిమ్మ నగర్ కు చెందిన సీనియర్ నాయకులు, వార్దు సభ్యులు గున్నాల యాకుబ్ రెడ్డి కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమానికి ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ హాజరయ్యారు. కళ్యాణానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ కూడా హాజరయ్యారు. నూతన వధూవరులైన నవ్య రెడ్డి మధుసూధన్ రెడ్డిలను అక్షింతలు వేసి ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి మాట్లాడి,యాకుబ్ రెడ్డి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి స్థానిక MPTC జాటోతు లాల్, MPTC మాచర్ల ప్రభాకర్, సర్పంచ్ బానోత్ యాకుబ్ మంజులా, తిరుమల్ రెడ్డి, తీగల కృష్ణ రెడ్డి, సురేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు గూగులోత్ హరి లాల్, బొక్క మహేందర్,రేణు కుంట్ల సురేష్, బల్గురి నవీన్ స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.