కడప జిల్లా రాజంపేట డివిజన్ కు చెందిన ప్రవాసాంధ్రులు కువైట్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా చేరుకోవడంతో వారిని ప్రత్యేక బస్సుల ద్వారా ఆరు క్వారంటైన్ కేంద్రాలకు ఆదివారం ఉదయం తరలించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వారు కువైట్ లో చాలా కాలంగా ఉంటున్నారు.
ప్రత్యేక విమానాల ద్వారా చేరుకున్న వీరిని ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు చేర్చి వారిని అన్ని జాగ్రత్తలను అధికారులు వివరించి చెప్పారు. రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీలో 145 మంది, అకేపాడు నవోదయ కాలేజీలో 75 మంది, రాజంపేట పాలిటెక్నిక్ కాలేజీలో 75 మంది, రైల్వే కోడూరు ఉద్యానవన కాలేజీ లో 75 మంది, పుల్లంపేట మోడల్ స్కూల్ లో 75 మంది, బద్వేలు యస్.బి.వి.ఆర్ కాలేజీలో 75 మంది ని ఉంచారు.
ఈమేరకు వైద్య, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతనెల లో రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీ లో క్వారంటైన్స్ 110 మంది రాగా కోవిడ్-19 పరీక్షల అనంతరం వారిలో 18 మందికి పాజిటివ్ రావడంతో కడప ఫాతిమా మెడికల్ కాలేజీకి తరలించారు. దీంతో ఇప్పుడు అధికారులు ప్రస్తుతం వీరి విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. సమ దూరం పాటిస్తూ దూరంగా ఉండి ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు.