బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా దోనోజు లక్ష్మయ్యను, ప్రధాన కార్యదర్శిగా ముదాం శ్రీనివాసరావు ను ఎన్నుకున్నారు. ఖమ్మం లో జరిగిన 13వ మహాసభలో అనేక అంశాలపై చర్చించారు. సంఘ కార్యక్రమాలపై చర్చించి , భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకున్నారు. జిల్లా కమిటీ లో 13 మందిని ఆఫీస్ బేరర్స్ గా , 32 మందిని కమిటీ సభ్యులుగా మొత్తం 45 మందితో కమిటీని ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా వారికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు , పెరుమాళ్ళపల్లి మోహన్ రావు , అమర బోయిన లింగయ్య , బి వీరబాబు , యస్ కె జమాల్ , ఎర్ర మల్లికార్జున్ , బుచ్చాల వెంకటేశ్వర్లు , మేడికొండ నాగేశ్వరరావు , వశపొంగు వీరన్న , పగిడికత్తుల నాగేశ్వరరావు , టి యస్ కల్యాణ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు .
previous post