32.2 C
Hyderabad
March 28, 2024 23: 56 PM
Slider ముఖ్యంశాలు

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టీవీ యాంకర్ ప్రదీప్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేడు మొక్కలు నాటారు. ఇందులో పాల్గోవడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీనారాయణ అన్నారు. చెట్లతోనే మనిషి మనుగడ, చెట్లతోనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు.

ఇది గ్రహించిన తెలంగాణ సిఎం కెసిఆర్ గత ఆరు సంవత్సరాల నుండి తెలంగాణకి హరితహారం ప్రోగ్రాం చేస్తూ 270 కోట్ల మొక్కలు నాటాలని ఉద్దేశం నిజంగా గొప్పదని ఆయన అన్నారు. దీనికి కొనసాగింపుగా ఎంపీ సంతోష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశమంతా కొనసాగించడం నిజంగా అభినందనీయమని ఆయన అన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ ను ఆయన అభినందించారు. జెఎన్ టెయు మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ రాజగోపాల్, గుంటూరు హిందూ కాలేజి మాజీ లెక్చరర్ ఎస్ వి ఎస్ లక్ష్మీనారాయణ, భద్రాచలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంభంపాటి సురేష్ లకు ఆయన గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

Related posts

కమలా హారిస్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

మెరుగుపడిన తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి

Bhavani

స్పందనలో అందిన 27 ఫిర్యాదులు… అధికంగా ఆస్తి  త‌గ‌దాల కేసులే

Satyam NEWS

Leave a Comment