రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా చిత్తూరు నందు నూతనంగా నిర్మించిన లలిత జ్యువలరి చిత్తూర్ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగలంటే ఇష్టపడని మగువ ఉండరు, ఒక్క నగల షాపుకి మాత్రమే కులం మతం పార్టీల తారతమ్యాలుండవ్ అందరూ వచ్చేది మెచ్చేది పసిడి. నేను నటిగా చెన్నైలో ఉన్నప్పుడు లలితా జువలరీస్స్ లోనే నగలు కొనేవాళ్ళం, ఈరొజు చిత్తూరు లో బ్రాంచ్ స్థాపించడం చాలా సంతోషం ఉంది. ఇంటికి వచ్చి కొత్త బ్రాంచ్ నా చేతులు మీదగా ప్రారంభించాలి అని సిఎండి కిరణ్ కుమార్ అడగటం నాకు చాలా సంతోషం కలిగించింది అని అన్నారు. నాణ్యత కి వీరు పెట్టింది పేరు మరిన్ని బ్రాంచ్ లు స్థాపించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లలిత జ్యువెలరీ సీఎం కిరణ్ కుమార్, రాయలసీమ కాలేజ్ ఎండి ఆనంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
previous post