Slider ముఖ్యంశాలు

నల్లకుంట శంకర మఠంలో లలిత్ ఆదిత్య అష్టావధానం

Darshanam sharma

అమెరికాలో పుట్టి పెరిగినా మాతృభాష, దేవభాష మీద మమకారంతో చిన్నతనంలోనే కఠోర దీక్షతో సంస్కృతాంధ్ర పండితునిగా ఎదిగి అష్టావధానిగా ప్రఖ్యాతి గడించిన సరస్వతీ పుత్రుడు గన్నవరం  లలిత్ ఆదిత్య. ఇటీవల కొద్ది రోజుల పర్యటన కోసం హైదరాబాద్  విచ్చేసిన లలిత్ ఈ సంవత్సరం జనవరి 16న రవీంద్రభారతిలో ఉద్దండులయిన పండితులు శతావధానులు, అష్టావధానులు, వేలాదిమంది సాహితీప్రియుల సమక్షంలో అద్వితీయంగా సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం చేసి సాహితీలోకాన్ని అబ్బురపరిచి సర్వత్రా ప్రశంసలు చూరగొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ బాలుడు కొన్నేళ్లుగా అమెరికాలో  సంస్కృతాంధ్ర అష్టావధానాలు అద్భుతంగా చేస్తున్నారు. అమెరికాలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ మొదటిసంవత్సరం  పూర్తి చేసుకుని మూడునెలల సెలవుల కాలంలో భారతదేశానికి వచ్చి శృంగేరీ లోని రాష్ట్రీయ సంస్కృతవిద్యా పీఠంలోని ఓ ఆచార్యుని వద్ద వ్యాకరణం నేర్చుకున్నారు. శృంగేరీ జగద్గురువులు ఈ నవయువ విద్వన్మణి, అవధాని ఉభయభాషా పండిత్యానికి సంబురపడి ఆశీరానుగ్రహాన్ని కురిపించారు. కొద్దిరోజుల క్రితం పూణేలో జరిగిన లలిత్ అష్టావధానానికి వేలాదిమంది కిక్కిరిసిన సాహితీప్రియులనుంచి విశేష స్పందన వచ్చింది..ఈరోజే భాగ్యనగరానికి వచ్చిన లలిత్ ఆదిత్య  19న తిరిగి అమెరికా వెళ్తున్నారు. ఈ సందర్బంగా భాగ్యనగరంలో ఈ యువ అవధాన శిరోమణి “అష్టావధానం” ఆదివారం 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు నల్లకుంటలోని శృంగేరీ శంకరమఠం లో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక ఏర్పాటు చేసింది. అమెరికా తెలుగు తేజం 18 ఏళ్ల లలిత్ ఆదిత్య అష్టావధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఈ అద్భుత సాహితీ ప్రక్రియను ఆస్వాదించటానికి  సాహితీప్రియులందరూ అధికసంఖ్యలో పాల్గొనవలసిందిగా దర్శనమ్ సంపాదకుడు మరుమాముల వెంకటరమణ శర్మ (9441015469, 7013093123) ఒక ప్రకటనలో కోరారు.

Related posts

20న కొల్హాపూర్ కు ప్రియాంక

mamatha

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

mamatha

పేదల ఇల్లు తొలగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు

Satyam NEWS

Leave a Comment