రూ.3.5 లక్షల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు దొంగలు.సినీ ఫక్కిలోనే బంధువులుగా గుంపుగా వచ్చి సేల్స్ మెన్ లను బురిడీ కొట్టించి పంజాగుట్టలోని లలిత జువెల్లరీలో చోరీ చేసిన ఘటన ఒకటి ఆలస్యంగా బయటకి వచ్చింది.షాప్ సిబ్బంది దృష్టి మరల్చిన దొంగలు ఆభరణాలను దోచుకెళ్లారు.
పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 15న సాయంత్రం కొందరు వ్యక్తులు గుంపుగాలలిత జువెల్లరీ షాపులోకి వచ్చి వినియోగదారుల్లా నటిస్తూ ఆభరణాలను చూశారు. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది దృష్టి మరల్చి రెండు బంగారు గొలుసులు, బ్రాస్లెట్ను చోరీ చేశారు. వీటి విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని వారు తెలిపారు.ఐతే ఆభరణాలు చోరీ అయిన విషయం సిబ్బంది గుర్తిలేదు.
ఈ విషయం ఆడిట్లోవెలుగు చూడటం తో సీసీ కెమెరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలోనే ఎవరో ఆభరణాలను మాయం చేసినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.