28.7 C
Hyderabad
April 20, 2024 07: 09 AM
Slider తెలంగాణ

టెక్ టిప్స్:గుంపుగావచ్చిపంజాగుట్ట లలిత జువెల్లరీలో చోరీ

lalitha juvellary theft

రూ.3.5 లక్షల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు దొంగలు.సినీ ఫక్కిలోనే బంధువులుగా గుంపుగా వచ్చి సేల్స్ మెన్ లను బురిడీ కొట్టించి పంజాగుట్టలోని లలిత జువెల్లరీలో చోరీ చేసిన ఘటన ఒకటి ఆలస్యంగా బయటకి వచ్చింది.షాప్ సిబ్బంది దృష్టి మరల్చిన దొంగలు ఆభరణాలను దోచుకెళ్లారు.

పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 15న సాయంత్రం కొందరు వ్యక్తులు గుంపుగాలలిత జువెల్లరీ షాపులోకి వచ్చి వినియోగదారుల్లా నటిస్తూ ఆభరణాలను చూశారు. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది దృష్టి మరల్చి రెండు బంగారు గొలుసులు, బ్రాస్‌లెట్‌ను చోరీ చేశారు. వీటి విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని వారు తెలిపారు.ఐతే ఆభరణాలు చోరీ అయిన విషయం సిబ్బంది గుర్తిలేదు.

ఈ విషయం ఆడిట్‌లోవెలుగు చూడటం తో సీసీ కెమెరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలోనే ఎవరో ఆభరణాలను మాయం చేసినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ప్రముఖ ర‌చ‌యిత ప‌తంజలి జ‌యంతి సంద‌ర్బంగా సాహిత్య పుర‌స్కారం

Satyam NEWS

డేంజర్:పసుపు రైతుకు డెంపా తెగులు భయం

Satyam NEWS

పిఎఫ్‌ఐ నిషేధంపై మొత్తుకుంటున్న పాకిస్తాన్

Satyam NEWS

Leave a Comment