ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. అయితే ఆయన్ని అకస్మాత్తుగా అత్యవసర విభాగంలో ఎందుకు చేర్చారనేది ఇంకా తెలియరాలేదు. అనారోగ్య కారణాలతో లాలూ యాదవ్ పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లారు.
పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు లాలూ బీహార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ, ఆయన నితీష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా చుట్టుముట్టారు. విద్య, ఆరోగ్యం రంగంలో బీహార్ వెనుకబడి ఉందని అన్నారు. లాలూ యాదవ్ ఆరోగ్యం చాలా కాలంగా బాగా లేదు. అందుకే జైలులో ఉండగానే ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. అంతకు ముందు కూడా రిమ్స్ లో చికిత్స పొందారు. జైలు నుంచి బెయిల్ పొందినా లాలూ అనారోగ్య కారణాలతో ఢిల్లీలోనే ఉన్నారు.