సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రెవెన్యూ పరిధి లోని బూరుగడ్డ గ్రామంలో ఓ రైతుకు తీరని అన్యాయం జరుగుతున్నది. తమ పేరిట ఉన్న పొలాన్ని అన్యాయంగా అక్రమంగా గొల్ల గోపు రాధాకృష్ణ అనే వ్యక్తి అధికారుల అండదండలతో ఆక్రమించుకున్నాడని గొల్లగోపు సైదులు ఆరోపిస్తున్నాడు.
గత 50 సంవత్సరాలుగా తమ పేరు మీద పట్టా ఉన్నా కూడా తాజాగా అతని పేరు మీద పట్టా చేయించుకున్నాడని సైదులు అంటున్నాడు. తాము సాగు చేసుకుంటున్న ఈ భూమికి తమ పేరు మీదే రైతు బంధు, రైతు బీమా అన్నీ ఉన్నాయని తెలిపారు.
ఎన్ని సార్లు హుజూర్ నగర్ తాసిల్దార్ వజ్రాల జయశ్రీకి మొరపెట్టుకున్నా ఫలితం లేదని, తమకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని గొల్లగోపు సైదులు తెలియజేశారు.