నాడు పట్టా భూమి, నేడు ప్రభుత్వ భూమి అని దళితుల మీదనే కేసు పెట్టి, అక్రమార్కులకు భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నగర గారి ప్రీతం, ప్రభుత్వం దళితుల భూములు గుంజుకోవడమే కాకుండా, ఇల్లు ని కూల్చివేసి, పేద దళితుల్ని రోడ్డు పాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, పేద దళిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున పోరాటానికి సిద్ధమని దళిత సంఘాలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ యస్సీ విబాగం చైర్మెన్ పత్తి కుమార్, హైదరాబాద్ విభాగం చైర్మన్ రమేష్ బాబు, రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ బండి మధుసూదన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.