హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరెడుచర్ల మండల కేంద్రంలోని నేరేడుచర్ల మిర్యాలగూడ రోడ్డులో ని ఈద్గా స్థలానికి అధికారికంగా పట్టా మంజూరు చేశారు. గత నలభై సంవత్సరాల నుండి ఎలాంటి పట్టా లేకపోవడంతో చుట్టూ పక్కల వారి ప్రమేయంతో స్థలం కొద్దికొద్దిగా ఆక్రమణకు గురౌతున్నది.
ఈ సమయంలో నేరెడుచర్ల ముస్లిం మత పెద్దలు డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్ళారు. అప్పిరెడ్డి స్థానిక ఎమ్మల్యే శానంపూడి సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్ళటంతో ఎమ్మెల్యే స్పందించి వెనువెంటనే ఉన్నత అధికారితో మాట్లాడి ఈద్గాకి పట్టా మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ చందమళ్ళ జయబాబు, 3, 4వ కౌన్సిలర్లు షేక్ షేహనాజ కరిముల్లా, షేక్ బాషా, మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి, టిఆర్ఎస్ మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రాజేష్ పాల్గొన్నారు.
ఇంకా, టిఆర్ఎస్ హుజూర్ నగర్ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ గౌస్, నేరేడుచర్ల మైనార్టీ అధ్యక్షుడు ఎమ్ డి ఖాదర్ పాషా, ఎమ్ డి మీరా, ఎమ్ డీ ఇబ్రహీం, భాషీర్, హఫీజ్, కాషిం, అంజతుల్లా తదితరులు పాల్గొన్నారు.