పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి యాష్ పాండ్ వద్ద ఉదయం ఆరున్నర గంటల సమయములో రోడ్డు ప్రమాదం జరిగింది. బూడిద తీసుకురావడానికి వెళుతున్న ఒక లారీ మూల మలుపు వద్ద చెట్టును ఢీకొట్టి బోల్తా పడ్డది. ఈ ప్రమాదంలో గోదావరిఖనికి చెందిన డ్రైవర్ పిల్లి శ్రీనివాస్ ఏజీ 30 విటల్ నగర్, క్లీనర్ మహమ్మద్ అబ్దుల్ గఫూర్ ఏజీ 20 విటల్ నగర్ కు చెందిన ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న అంతర్గాం ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాలు సేకరించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
previous post