జమ్మూ కాశ్మీర్ లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్ ఉగ్రవాది హతమయ్యాడు. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు విభాగం (ఎస్ఐయూ) ఆదివారం ఉదయం అనంత్నాగ్ జిల్లాలోని బిజ్బిహారా ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించిన సమయంలో ఈ ఘటన జరిగింది. అనుమానాస్పద స్థావరం వైపు సెర్చ్ పార్టీ చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో కుల్గామ్కు చెందిన లష్కర్ ఉగ్రవాది హతమయ్యాడు. ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదిని కుల్గామ్కు చెందిన సజ్జాద్గా గుర్తించారు. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు విభాగం (SIU) దర్యాప్తు కోసం ఆదివారం ఉదయం అనంతనాగ్ జిల్లాలోని బిజ్బిహారా ప్రాంతానికి చేరుకున్నారు. అనుమానాస్పద స్థావరం వైపు సెర్చ్ పార్టీ చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. నవంబర్ 13న అనంత్నాగ్లో హతమైన ఉగ్రవాది సజ్జాద్ ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కార్మికులపై దాడి చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కార్మికులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చోటా ప్రసాద్ అనే కార్మికుడు నవంబర్ 18 న మరణించాడు.