న్యాయశాస్త్ర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి షెడ్యూల్ విడుదల చేసి, వివరాలు తెలిపారు. ఎల్ఎఎల్బీ (3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కోర్సు), ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్షను 21 కేంద్రాల్లో నిర్వహిస్తామని చెప్పారు.
3 సంవత్సరాల లా కోర్సును జూన్ 21న, ఐదు సంవత్సరాల కోర్సు, ఎల్ఎల్ఎంను జూన్ 22న నిర్వహిస్తామన్నారు.