UPSC, తెలంగాణ రాష్ట్ర స్థాయి LAWCET ఒకే రోజు (అక్టోబర్ 04 న) ఉన్నందున LAWCET తేదిని మార్చాలని OU విద్యార్థి JAC రాష్ట్ర కార్యదర్శి అన్నం నాగార్జున డిమాండ్ చేశారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4 న తేదీన జరపాలని నిర్ణయించటం కరోనా నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన ఎంట్రన్స్ పరీక్ష వాయిదా పడ్డాయి.
ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రన్స్ పరీక్షలు షెడ్యూల్ లో అక్టోబర్ 04 న లాసెట్ పరీక్ష జరపాలని నిర్ణయించారు. ఒకే రోజు ఈ రెండు పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది.
అందువల్ల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పరీక్ష తేదిని మార్చాలని నాగార్జున కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ T.పాపిరెడ్డి కి Mali ఆధారంగా వినతి పత్రం అందించామని ఆయన తెలిపారు.