సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బుధవారం ధనుర్మాసం సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ప్రాత కాల అర్చన,శ్రీమహావిష్ణు సహస్రనామార్చన,గోదా అస్తోత్రం,రామానుజ అష్టోత్తరం,స్తోత్రం నిర్వహించారు. అనంతరం తిరుప్పావై సేవాకాలం మహిళలు సమష్టిగా నిర్వహించారు. కుంకుమను స్థానిక భక్తులు కామిశెట్టి స్వామి, కళావతి దంపతుల ఇంటి వద్ద నుండి మేళ,తాళాలతో దేవాలయానికి ఊరేగింపుగా తీసుకొనివచ్చి, మూలమూర్తులైన గోదాదేవి అమ్మవారికి పంచామృతాలతో, పంచసూక్త విధానంగా అర్చకులు అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలతో అలంకరించి,స్వామి,అమ్మవారిని మహా మండపంలో భద్ర పీఠంపై అధిష్టింప చేశారు.
ఋత్వికులు సహస్ర నామాలు పఠించగా,అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేశారు. అనంతరం చందన గోష్ఠి గావించి ఋత్వికులను సన్మానించారు. పిదప స్వామి, అమ్మవారికి నీరాజన,మహా మంత్రపుష్పం గావించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ముడుంబ దామోదరా చార్యులు ఈనాటి పాశురం గురించి భక్తులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జగన్నాథచార్యులు,ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి,ధర్మ కర్తలు రాము, పద్మ,గురవయ్య,నరసింహమూర్తి, వెంకటేశ్వర్లు,వెంకన్న భాగవత భక్త మండలి సభ్యులు వంకాయల పద్మ, భారతమ్మ,కళావతి,సుజాత,పిచ్చమ్మ, ఆలయ అర్చకులు మురళి కృష్ణమాచార్యులు,భాస్కరాచార్యులు, నరసింహాచార్యులు,స్థానాచార్యులు శ్రీనివాసాచార్యులు, రామకృష్ణమాచార్యులు,విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్