ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా డి లక్ష్మి ప్రసన్న ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ పదవి మహిళలకు రిజర్వేషన్ కావడంతో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులతో లక్ష్మీ ప్రసన్న ఈ పదవిని దక్కించుకున్నారు.
వైస్ చైర్మన్ గా కుంటముక్కల వెంకటేశ్వర్లు, సభ్యులుగా నారాపోగు నాగయ్య ,అజ్మీరా వీరన్న, జి శ్రీనివాసులు, షేక్ అప్జల్, నాగండ్ల భద్రయ్య,ఎం వెంకటేశ్వర్లు , పత్తిపాక రమేష్ డి అనిల్ లను నియమిస్తు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎన్ రఘునందన్ రావు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సర్కులర్ జారీ చేశారు.