ఖమ్మం పట్టణంలోని బ్రాహ్మాణ బజారులో కోలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ కార్యక్రమంతో మొదలైన ఉత్సవాలు ఈ నెల 29 వరకు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. సంప్రదాయ పూజలు, పండితుల వేదపఠనం, పూజారుల మంత్రోచ్చరణలు, సన్నాయి బృందం రాగాలాపన.. భక్తుల జయజయ నినాదాల మధ్య విశేష పర్వాన్ని వైష్ణవ ఆచారంగా చేపట్టారు. తొలుత ధ్వజవాహనంపై శ్రీస్వామి, ప్రత్యేక పల్లకిపై అమ్మవారలను అధిష్ఠింపచేసి వేదమంత్రోచ్చరణల మధ్య విష్వక్సేన ఆరాధనతో మొదలై ఆద్యంత భక్తి పూరిత వాతావరణంలో కొనసాగింది.
previous post