37.2 C
Hyderabad
March 29, 2024 20: 51 PM
Slider తెలంగాణ

మంత్రి తలసానికి పౌల్ట్రీ రైతుల నిరసన సెగ

పౌల్ట్రీ రైతుల నిరసన సెగ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు తగిలింది. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి ఎగ్జిబిషన్ లో జరుగుతున్న పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. విపరీతమైన నష్టాలతో చిన్న స్థాయి పౌల్ట్రీ యజమానులు నష్టాల పాలవుతున్నారని పౌల్ట్రీ రైతులు ఆరోపించారు. లేయర్ కోళ్ల రైతులకు వస్తున్న సబ్సిడీలను  బ్రీడర్లు, ఫీడ్ కంపెనీలు తన్నుకు పోతున్నారని వారు ఆరోపించారు.

లేయర్ ఫార్మర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేయర్ పౌల్ట్రీ రైతుల సమస్యలను నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్ పర్సన్ అనురాధా దేశాయ్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. లేయర్ పౌల్ట్రీ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఎగ్ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి తలసాని ఎదుటే ఈ నినాదాలు చేయడంతో ఆయన ఆగి వారి సమస్యలు విన్నారు.

Related posts

న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది

Satyam NEWS

కువైట్ యన్టీఆర్ సేవాసమితి వరుస అన్న వితరణ

Satyam NEWS

ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ ఫలితాల వెల్లడి

Satyam NEWS

Leave a Comment