34.2 C
Hyderabad
May 19, 2025 17: 47 PM
Slider హైదరాబాద్

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

#MLASudhirReddy

హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ నియోజకవర్గం శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. సుధీర్‌ రెడ్డి భార్యకు మూడు రోజుల క్రితం కరోనా నిర్ధరణ అయ్యింది. నిన్న ఇద్దరు కుమారులతో కలిసి సుధీర్ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకోగా ముగ్గురికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది.

ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అభిమాన నాయకుడు తాము ఎంతగానో  అభిమానించే  అన్నసుధీర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కరోనా బారిన పడటంతో నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా మహమ్మరిని  జయించి త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆయన ప్రజా సేవ లో నిమగ్నం కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.

Related posts

వృత్తి ధర్మం తప్పిన జర్నలిస్టుపై బహిష్కరణ వేటు

Satyam NEWS

పత్తి పరిశోధన కేంద్రాన్ని ఆదిలాబాద్ లోనే ఏర్పాటు చేయాలి

Satyam NEWS

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్దమైన ఎర్రకోట

mamatha

Leave a Comment

error: Content is protected !!