27.7 C
Hyderabad
April 26, 2024 03: 27 AM
Slider హైదరాబాద్

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

#MLASudhirReddy

హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ నియోజకవర్గం శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. సుధీర్‌ రెడ్డి భార్యకు మూడు రోజుల క్రితం కరోనా నిర్ధరణ అయ్యింది. నిన్న ఇద్దరు కుమారులతో కలిసి సుధీర్ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకోగా ముగ్గురికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది.

ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అభిమాన నాయకుడు తాము ఎంతగానో  అభిమానించే  అన్నసుధీర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కరోనా బారిన పడటంతో నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా మహమ్మరిని  జయించి త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆయన ప్రజా సేవ లో నిమగ్నం కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.

Related posts

దళితుల భూములపై అటవీశాఖ అధికారులు నజర్

Satyam NEWS

పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

Satyam NEWS

వరద నేపథ్యంలో దుర్గమ్మ నదీ విహారోత్సవం రద్దు

Satyam NEWS

Leave a Comment