కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని మూసి వేస్తూ పురావస్తు శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అయితే అర్చకులు మాత్రం ప్రతిరోజు ఉదయం స్వామి వారి పూజలు నిర్వహిస్తారు.
కరోనా కేసులు పెరుగుతున్నందున భక్తులకు ఆలయ ప్రవేశం రద్దు చేసినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.