27.7 C
Hyderabad
April 25, 2024 10: 35 AM
Slider అనంతపురం

ఝాన్సీరాణి స్పూర్తితో పోరాడదాం..

అపూర్వ యుద్ద నిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు స్వాతంత్ర సేనాని ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురంలో జనసేన రాయలసీమ మహిళా విభాగం ఘనంగా నిర్వహించింది. ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో జయంతి వేడుకలను జరిపారు.

ఈ సందర్భంగా శ్రీలత ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ ప్రజలపై తెల్లదొరల దమనకాండకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం సాగించి ఆత్మార్పణం చేసిన దిశాలి ఝాన్సీ రాణి అని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళా సాధికారతకు, రాజకీయాలలో మహిళల ప్రాధాన్యతకు కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీలోకి పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి నగర ప్రధాన కార్యదర్శి రోళ్ళ భాస్కర్ వీర మహిళలు శైలజా,యమునా, కుళ్లయమ్మ, అనసూయ, వరలక్ష్మి,మంజుల నాయకులు పూజారి పవన్ , ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్.నెట్ అనంతపురం

Related posts

పాత్రికేయులే కరోనాపై అపోహలు తొలగించాలి

Satyam NEWS

లెజెండరీ జర్నలిస్టు: పొత్తూరి వెంకటేశ్వరరావు ఇక లేరు

Satyam NEWS

ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో పేదల భూములు స్వాహా

Satyam NEWS

Leave a Comment