విదేశాల్లో చదివే విద్యార్థుల స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ లేఖ సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో పలు విషయాలను పేర్కొన్నారు.
అల్పాదాయ వర్గాల విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు గత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. ఒక్కో విద్యార్థికి రు.10 లక్షల మేర గత ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇచ్చింది. సీఎంగా అధికారంలోకి వచ్చాక విదేశీ విద్యార్థులకు ఇప్పటివరకు స్కాలర్ షిప్లను ఎందుకు మంజూరు చేయలేదన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఆర్థిక స్థితిగతుల విషయమై ఆందోళన చెందుతున్నారని కె రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.