అధికార వికేంద్రీకరణ బిల్లును కపట రాజకీయాలతో అడ్డుకుంటున్న చంద్రబాబునాయుడి కుట్రలను గమనించాలని కడప జిల్లా వైసిపి నాయకులు భారత రాష్ట్ర పతికి లేఖ పంపారు. రాజంపేట మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి ముందుగా ఈ లేఖపై సంతకం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను ప్రభావితం చేస్తూ, ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తుంటే చంద్రబాబునాయుడు అడ్డుపడుతున్నారని వారన్నారు. చంద్రబాబు మండలి చైర్మన్ ను కనుసైగలతో శాసించి అధికార వికేంద్రీకరణ బిల్లు ను అడ్డుకోవడం దారుణమని అన్నారు. రాష్ట్రపతిగా తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని ప్రజల సంతకాలతో కూడిన లేఖను మీకు పంపుతున్నాము అని మాజీ శాసనసభ్యుడు ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ పోలా శ్రీనువాసులు రెడ్డి, నాయకులు పోలి మురళి మోహన్ రెడ్డి, పసుపులేటి సుధాకర్, పెంచలయ్య నాయుడు, వేణుగోపాల్ రెడ్డి, సుబ్బరాజు, మార్కెట్ వైస్ ఛైర్మన్ భాస్కర్ రాజు, యూసఫ్, జహీద్, నాగేశ్వర్ నాయుడు, సుబ్బారాయుడు, మీసాల వెంకట సుబ్బయ్య, సుబ్బరాజు, శంకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.