విజయనగరంలో మరో ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్ ను సుందరంగా తీర్చిదిద్దడంతో…విద్యల నగరం కాస్త కాంతినీలు నగరంగా మారింది. కొన్నాళ్ల క్రితం…నగరంలోని అయ్య కోనేరు గట్టు ప్రాంత చెరువును శుద్ది చేసి లైట్లు అమర్చి నడక మార్గాన్నికూడా వీఎంసీ ఏర్పాటు చేసింది.
తాజాగా..అయ్యన్న పేట కోనేరు వద్ద 16 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన నూతన లైటింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ ప్రారంభించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ తో ఈ కోనేరు రాత్రి వేళల్లో మరింత సుందరంగా, కాంతివంతంగా కనిపిస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ అప్పారావు, హరిత విజయనగరం కో.ఆర్డినేటర్ రామ్మోహన్, శైలాడ ఈశ్వరరావు, లెంక సత్యం , సీతం నాయుడు, లెంక సంతోష్, కర్రోతు అప్పారావు, శైలాడ హరి, స్థానిక నాయకులు శైలాడ సత్యనారాయణ, శైలాడ జగన్మోహన్, చెరువు అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.