కడప జిల్లా నందలూరు హరిజనవాడకు చెందిన శివకృష్ణ అనే వ్యక్తి శనివారం రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ లో రైల్వే కరెంట్ లైను రిపేరు చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మధ్యాహ్నం కరెంట్ వైర్ తెగి కింద పడడంతో దానిని రిపేరు చేసేందుకు రేణిగుంట, రాజంపేట సిబ్బంది వచ్చి రిపేరు చేస్తున్నారు.
అలా చేస్తుండగానే విద్యుత్ వైర్లు మళ్లీ తెగిపోవడంతో అక్కడ పనిచేస్తున్న రాజంపేట కు చెందిన శివ అనే వ్యక్తి రైలు పైనుంచి కింద పడ్డాడు. అతనిని 108 వాహనంలో రైల్వే కోడూరు లో ఆసుపత్రికి తరలించారు. ధారా శివకృష్ణ రైల్వే కోడూరు ఆసుపత్రిలో మృతి చెందారు. నందలూరు హరిజనవాడకు చెందిన శివకృష్ణ రాజంపేట రామనగర్ లో పెళ్లి చేసుకొని అక్కడే నివసిస్తున్నాడు.