స్వచ్ఛంద సేవ సంస్థ ల శాశ్వత సేవలు అభినందనీయమని ములుగు ఏఎస్పీ పి.సాయి చైతన్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి పూర్వ లయన్స్ గవర్నర్ లయన్ దీపక్ భట్టాచార్జీ జన్మదినాన్ని పురస్కరించుకుని లైన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వివేకానందపురం వారి సహకారంతో రెండు సక్షన్ పరికరాలను అందచేశారు.
క్లబ్ డైరెక్టర్ లయన్ పింగిలి నాగరాజు వీటిని సమకూర్చగా ములుగు ఏఎస్పీ సాయి చైతన్య ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డా జగదీష్ కు అందజేశారు. విషం ఎక్కిన వారిని ఆపరేషన్ సమయంలో దాన్ని కక్కించడానికి ఈ సక్షన్ పరికరాలు పనికి వస్తాయి.
ఈ సందర్బంగా ఏ.ఎస్పీ మాట్లాడుతూ ఈ సక్షన్ పరికరాలు ఆసుపత్రికి కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగ పడగలవని, స్వచ్చంద సంస్థలు శాశ్వత ప్రాతిపదికన నిలిచిపోయే సేవలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా క్లబ్ డైరెక్టర్ లయన్ పింగిలి నాగరాజు మాట్లాడుతూ ఆసుపత్రికి సక్షన్ పరికరాల అవసరం ఉన్నదని, వాటిని సమకూర్చమని సూపరింటెండెంట్ డా జగదీష్ చేసిన అభ్యర్ధన మేరకు క్లబ్ ద్వారా సుమారు ముప్పైవేల రూపాయల విలువగల ఈ పరికరాలను సమకూర్చినట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఆల్లెం అప్పయ్య, డా నారాయణరెడ్డి, ఇతర డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.